సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 17 : రాజగోపాల్రెడ్డి ప్రజలను మోసం చేసి తన స్వలాభం కోసం బీజేపీలో చేరుతున్నాడని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి విమర్శించారు. ప్రజా దీవెన సభకు మండలంలోని 16 గ్రామపంచాయతీలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆమె సమక్షంలో కడపగండితండా కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ కరంటోతు లచ్చిరాంనాయక్, వార్డు సభ్యుడు రమావత్ భాస్కర్నాయక్ బుధవారం టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆమె వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం నుంచి వారి నియోజకవర్గాలకు ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పీఏసీఎస్ చైర్మన్ జక్కడి జంగారెడ్డి, కడపగండి సర్పంచ్ కరంటోతు సాల శంకర్నాయక్, నాయకులు పాల్గొన్నారు.