సూర్యాపేట జిల్లా కేంద్రంలో సినీ తార రాశిఖన్నా సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ను ఆమె
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున హాజరైన పట్టణ ప్రజలు, అభిమానులకు అభివాదం చేసి ఉత్సాహపరిచారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
– సూర్యాపేట టౌన్, జూలై 12
సూర్యాపేట టౌన్, జూలై 12 : సూర్యాపేట జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంగళ్య షాపింగ్ మాల్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మాంగళ్య 15వ షాపింగ్మాల్ను ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరోయిన్ రాశిఖన్నా హాజరై సందడి చేశారు. హీరోయిన్ రాశీఖన్నాను చూసేందుకు అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమానికి వచ్చిన రాశీఖన్నా మొదటగా షాపింగ్మాల్ ఎదుట ఏర్పాటు చేసిన స్టేజీ ఎక్కి అభిమానులకు నమస్కరించి ఉత్సాహపర్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పెద్ద పెద్ద నగరాలకు వెళ్లకుండా లేటెస్ట్ డిజైన్లతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అన్ని రకాల వస్ర్తాలు మాంగళ్యలో అందుబాటులో ఉన్నాయన్నారు.
సరికొత్త నూతన వస్త్ర ప్రపంచం మాంగళ్య ప్రస్తుతం సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి రావడం శుభ పరిణామమన్నారు. ఇప్పటికే ప్రారంభించిన మాంగళ్య షాపింగ్మాల్స్ వినియోగదారుల మన్ననలు పొందుతున్నట్లు తెలిపారు. అనంతరం షాపింగ్ మాల్లో ప్రతి ఫ్లోర్ను సందర్శించి వస్ర్తాలను పరిశీలించి అభిమానులతో ఆనందం పంచుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్ కొండపల్లి భద్రమ్మాసాగర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్, రాచర్ల కమలాకర్, షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు పీఎన్.మూర్తి, పుల్లూరు అరుణ్, కాసం ఓం నమశివాయ, కాసం మల్లికార్జున్, కేదారినాథ్, శివప్రసాద్, కార్తీక్, కొల్లూరు వరుణ్, విశాల్ పాల్గొన్నారు.