హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ):ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగిన విద్యార్థులపై కేంద్రం, పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే మచ్చ గా మారిందని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంగళవారం ప్రకటనలో విమర్శించారు.
నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్రం తీరను నిరసిస్తూ శాంతియుతంగా గళమెత్తిన విద్యార్థులపై లాఠీలు, బాష్పవాయు గోళాలతో విరుచుకుపడటం దారుణమని మండిపడ్డారు. ఈ దేశ పౌరులకు జవాబుదారీగా నిలువాల్సిన ప్రభుత్వాలు, ఇలా ప్రజాస్వామిక గొంతుకలను నొక్కడానికి ప్రైవేట్ గుండాలు, కోవర్టులను వాడుకోవడం దారుణమని మండిపడ్డారు.