– కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్
కట్టంగూర్, జనవరి 03 : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ అన్నారు. శనివారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు సరిపడా వసతులను కల్పించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను విద్యార్థులు క్రమశిక్షణతో విని ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తేవాలన్నారు. ఆమె వెంట ఎంఈఓ అంబటి అంజయ్య, పాఠశాల చైర్మన్ దొరెపల్లి పద్మ, ఊట్కూరి సాయి ఉన్నారు.