సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 9 : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం వర్తమానానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు 108వ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కాళోజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. తన బతుకంతా తెలంగాణకు ఇచ్చిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు.
నిజాం దమననీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కలమెత్తిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉద్యమకారుడు అని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా గుర్తించి గౌరవించడంతో పాటు వరంగల్లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించారని తెలిపారు. కాళోజీ ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, నాయకులు తూడి నర్సింహారావు, ముదిరెడ్డి అనిల్రెడ్డి, కీసర వేణుగోపాల్రెడ్డి, ఎల్గూరి రాంబాబుగౌడ్, అమరవాది శ్రవణ్, అంజమ్మ, కరుణశ్రీ పాల్గొన్నారు.