బొడ్రాయిబజార్, మార్చి 10 : కంఠ మహేశ్వర స్వామి కృపతో ప్రజలు, గౌడ కులస్తులు ఆనందంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గౌడ కులస్తుల ఆరాధ్యదైవం కంఠ మహేశ్వరస్వామి సురమాంబ కల్యాణోత్సవంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి పెద్దఎత్తున తమ ఇష్ట దైవం కల్యాణం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కెక్కిరేణి నాగయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైరు వెంకన్నగౌడ్, మారిపెద్ది శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు, కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రాపర్తి పెద్ద శ్రీనివాస్, కోశాధికారి కెక్కిరేణి సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు ఎల్గూరి రాంబాబు, టైసన్ శ్రీను, కెక్కిరేణి ఆనంద్, బొమ్మగాని వెంకన్న, రాచకొండ నాగార్జున్, కృష్ణ, రాపర్తి దుర్గయ్యగౌడ్ పాల్గొన్నారు.