దేవరకొండ : దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం కోదండపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా వారు ఆలయంలో మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే నిధుల నుంచి ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అన్నారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను సన్మానించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీలు వంగల ప్రతాప్ రెడ్డి, నల్లగసు జాన్ యాదవ్, PACS చైర్మన్ వేలుగురి వల్లపు రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్, రైతు బంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.