అడవిదేవులపల్లి, ఏప్రిల్ 18 : మం డలంలోని చిట్యాల గ్రామంలో నిర్మించిన ఇన్టెక్వెల్ను రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అడిషనల్ కలెక్టర్ పూర్ణచందర్రావుతో కలిసి పరిశీలించారు. కృష్ణానదిపై నిర్మించిన టెయిల్పాండ్ బ్యాక్వాటర్ నుంచి ఈ నెల 15న 4 టీఎంసీల నీటిని దిగువన ఆంధ్రాకు వదిలారు.
టెయిల్పాండ్ బ్యాక్వాటర్ సామర్థ్యం 7 టీఎంసీలు ఉండగా.. 4 టీఎంసీల నీటిని దిగువకు వదలగా, మిగిలిన నీరు మిషన్ భగీరథ సప్లయ్కి సరిపోతాయా లేదా అని పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నా రు. 3 టీఎంసీల నీరు సరిపోనట్లయితే ఎగువన సాగర్ నుంచి నీటిని వదిలేందుకు ప్రభుత్వంతో మా ట్లాడుతామని తెలిపారు. ఆయన వెంట మిషన్ భగీరథ ఈఎన్సీ కృష్ణారెడ్డి, చీఫ్ ఇంజినీర్ చెన్నారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వంశీకృష్ణ, డీఈ సంపత్, ఏఈలు అన్వర్, జయంత్రెడ్డి, వెంకట్రెడ్డి, ఎంపీడీఓ కరుణాకర్రావు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.