రామన్నపేట, జనవరి 17 : దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే రోల్మోడల్గా నిలిచిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు నార్కట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదిన్నరేండ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణను నంబర్ వన్గా నిలిపారన్నారు. బీజేపీకి కళ్లెం వేయాలంటే పోరాటం, చైతన్య నేపథ్యం కలిగిన బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమన్నారు. ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలు సైతం బీఆర్ఎస్కు మద్దతివ్వడం శుభపరిణామమని తెలిపారు. సబ్బండ వర్గాలకు సమన్యాయంగా పథకాలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో ఇంద్రపాల శంకర్, తంగడపల్లి ఎల్లయ్య, మట్టి మల్లేశం, నల్ల రమేశ్, సంబోగు స్వామి, కంబాలపల్లి అంజయ్య, పుట్టల ముత్యాలు, నరేశ్, మహేశ్, రవి, అశోక్, సిద్ధయ్య, శేఖర్, సైదులు, నాగరాజు, జానయ్య, చంద్రయ్య, మల్లయ్య, కృష్ణయ్య, నవీన్, సిద్ధయ్య ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కాటేపల్లి యాదయ్య, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గర్దాసు విక్రం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మట్టి లింగస్వామి పాల్గొన్నారు.
మండలంలోని బాచుప్పల గ్రామానికి చెందిన పిండి నర్సింహకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లక్ష రూపాయలు మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ఓసీని నర్సింహ కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దోమల సతీశ్, నాయకుడు బొక్క పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.