నందికొండ, జనవరి 1 : నందికొండ హిల్కాలనీలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న నెట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. ట్రెడిషినల్ రాష్ట్ర స్థాయి జూనియర్ నెట్బాల్ పోటీల్లో బాలుర విభాగంలో నల్లగొండ జట్టు విజేతగా నిలిచి ప్రథమ బహుమతి గెలుచుకుంది. నారాయణపేట జట్టు రన్నరప్గా నిలిచింది. బాలికల విభాగంలో మేడ్చల్ జట్టు ప్రథమ, నల్లగొండ జట్టు ద్వితీయ బహుమతి గెలుచుకున్నాయి.
సోమవారం నిర్వహించిన ఫాస్ట్ ఫైవ్ ఫైనల్ పోటీల్లో బాలుర విభాగంలో నారాయణపేట జట్టు విజేతగా, మహబూబ్నగర్ జట్టు రన్నరప్గా నిలిచింది. బాలికల విభాగంలో నల్లగొండ జట్టు విజయం సాధించగా.. మేడ్చల్ జట్టు రన్నరప్గా నిలిచింది. అనంతరం విజేతలకు జిల్లా యువజన క్రీడల అధికారి మక్బూల్ అహ్మద్ బహుమతుల ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి, ఉపాధ్యక్షులు సారత్ఖాన్, మనోజ్కుమార్, ప్రధాన కార్యదర్శి ఖాజాఖాన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్కుమార్, పీఈటీ అనూరాధ, పాఠశాల హెచ్ఎం అన్నమ్మ, ఆర్గనైజింగ్ సభ్యులు పాల్గొన్నారు.