రామగిరి, డిసెంబర్ 11 : నల్లగొండ పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు, విశ్వబ్రాహ్మణ మనుమయ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పర్వతం అశోక్ బీఆర్ అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం అందుకున్నారు. దళిత సాహిత్య అకాడమీ సౌత్జోన్ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ్ధ ఆర్గనైజింగ్ కార్యదర్శి జితేందర్ అశోక్కు అవార్డు అందించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అవార్డు అందించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు అందుకున్న అశోక్కు కుటుంబ సభ్యులతోపాటు, మిత్రులు, శ్రేయేభిలాషులు అభినందనలు తెలిపారు.
నిఖిల్కుమార్కు జాతీయ ఫెల్లోషిప్
భారతీయ దళిత సాహిత్య అకాడమీ నిర్వహించిన సేవా పురస్కారాల్లో నల్లగొండ పట్టణానికి చెందిన అలిసారి నిఖిల్కుమార్కు మహాత్మాజ్యోతిరావు పూలే జాతీయ ఫెల్లోషిప్-2022 అవార్డు లభించింది. సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన కృషికి అవార్డు లభించింది.