నార్కట్పల్లి, జనవరి 16 : నార్కట్పల్లికి చెందిన లఘు చిత్ర దర్శకుడు, యువ చిత్రకారుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు నర్రా వేణుగోపాల్రెడ్డి ప్రతిష్టాత్మక ఎంఎఫ్ హుస్సేన్ పురస్కారానికి ఎంపికయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ ఆర్ట్ కాంటెస్ట్ 2024లో విశేష ప్రతిభ కనబర్చినందుకుగాను ఈ అవార్డుకు ఎంపికైనట్లు కార్యక్రమ నిర్వాహకులు మంగళవారం తెలిపారు.
చిన్ననాటి నుంచే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, దాని అనుబంధ రంగాల్లో కృషి చేస్తూ సాగుతున్న నర్రాకు ఈ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, ప్రపంచ ఐక్య ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి ఎంవీ గోనారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ప్రముఖ చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్, తేజ విద్యాలయ వ్యవస్థాపకుడు వి.సోమిరెడ్డి, జనభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, క్యాదర్శులు అభినందనలు తెలిపారు.