నల్లగొండ: పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నివారణకు మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. ఆయన గురువారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ సిబ్బందికి మట్టి విగ్ర హాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ రసాయనాలు, రంగులు లేని మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ కాలుష్యాన్ని నివారించే విధంగా ప్రజలు సహకరించాలన్నారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. రంగులతో కూడిన పెద్ద పెద్ద వినా యకులు పెట్టడం ప్రధానం కాదని.. ఎంత భక్తితో పూజ చేసిందే ముఖ్యమన్నారు. భక్తి భావం నింపుకుని పూజలు చేయా లని సూచించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ శాస్త్రవేత్త రవిందర్, సమాచార శాఖ ఏడీ శ్రీని వాస్, ఏవో మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.