నల్లగొండ రూరల్: టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వార్డు కమిటీలు కృషి చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని 6, 7, 8, 9, 10, 11, 24, 25, వార్డు కమిటీలను ఆయా వార్డుల్లో కమిటీ ఎన్నికలను ప్రకటించి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి పథకా లను అర్హులకు అందేలా చూడాలన్నారు. అదేవిధంగా పలు వార్డులో ఇతర పార్టీకి చెందిన వారు టీఆర్ఎస్ లో చేరారు.
అదేవిధంగా నల్లగొండ మండలంలోని 29 గ్రామాల అధ్యక్షులను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, నల్లగొండ మండల ఇన్ చార్జి కటికం సత్తయ్య గౌడ్ ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్ ,పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, బకరం వెంకన్న, మల్లేశ్గౌడ్, తవిట క్రిష్ణ ,వి మలమ్మ, బీరం గోపాల్రెడ్డి, జాన్రెడ్డి, తిరుమలేశ్, ఎలుక శ్రీనివాస్రెడ్డి, బైరెడ్డి వెంకట్రెడ్డి, జ్యోతి, సైదులు పాల్గొన్నారు.