నీలగిరి/ హాలియా, డిసెంబర్ 28 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గురువారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎన్నికల తరువాత నల్లగొండ పట్టణంలో జరిగిన పరిస్థితులను వివరించారు. అదేవిధంగా సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కేటీఆర్ను కలిశారు. స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా వారికి కేటీఆర్ సూచించారు.