మిర్యాలగూడ : సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లూ జీవించాలని కోరుతూ టీఆర్ఎస్ యువనాయకుడు నల్లమోతు సిద్ధార్థ, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటి, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు వెల్దండ లింగారెడ్డి, చిట్టిబాబూనాయక్, కుర్ర విష్ణు, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, అన్నభీమోజు నాగార్జునాచారి, పి.శ్రీనివాస్గౌడ్, లక్ష్మీనర్సింహ, ఎండీ.షోయబ్, సైదులుబాబు, సైదిరెడ్డి పాల్గొన్నారు.
డిండి : మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కేక్కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్రావు, నాయకులు రాములు, జంగిరెడ్డి, సాయమ్మ, కాషన్న, గిరిమోని శ్రీను, ప్రమీల, వెంకటయ్య, సురేశ్, జహంగీర్ పాల్గొన్నారు.
చందంపేట : మండల కేంద్రంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. మాజీ ఎంపీపీ రమాగోవింద్యాద్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శంకర్నాయక్, మల్లేశ్, మోహన్కృష్ణ, మహేశ్, ముత్తు, శేషు, వెంకటయ్య, రాములుగౌడ్ పాల్గొన్నారు.
మాల్ : చింతపల్లి, కుర్మేడు, మాల్లో టీఆర్ఎస్ నాయకులు కేక్కట్ చేశారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పాల్గొని స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నట్వ గిరిధర్, కొండూరి శ్రీనివాస్, మామిడి పరమేశ్, పులిరాజుగౌడ్, చంద్రశేఖర్, ఖాలేద్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : మండలంలోని జంకుతండాలో ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. ఆలగడపలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ధనావత్ చిట్టి బాబు నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు సైదులు యాదవ్, ప్రసాద్, సర్పంచ్ రవీందర్నాయక్ నాయకులు పాల్గొన్నారు.
దామరచర్ల : మండల కేంద్రంతో పాటు వాడపల్లి, రాజగట్టు, వీర్లపాలెం గ్రామాల్లో కేక్ కట్చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆలయాల్లో పూజలు చేశారు. నాయకులు కె. వీరకోటిరెడ్డి, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు దత్తునాయక్, బాల శ్రీనివాస్, పి. కోటిరెడ్డి, వీరసైదులు, బాల సత్యనారాయణ, నాగుల్మీరా, పి. శ్రీనివాస్రెడ్డి, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి : ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. జడ్పీటీసీ కుర్రా సేవ్యానాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల చినరామయ్య, ప్రధాన కార్యదర్శి కుర్రా శ్రీను, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మర్రెడ్డి, కుర్రా ఫకీరా, భీమా, ఎంపీటీసీ లింగయ్య పాల్గొన్నారు.
తిరుమలగిరి (సాగర్) : టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య మండల కేంద్రంలో కేక్ కట్ చేశారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి తిరుమల్, ఉపాధ్యక్షుడు చవ్వా నాసర్రెడ్డి, నాయకులు గజ్జెల శ్రీనివాస్రెడ్డి, జటావత్ జవహర్, రమేశ్నాయక్, మహిళా అధ్యక్షురాలు జంగాల లక్ష్మమ్మ, యూత్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షుడు శాగం అంజిరెడ్డి, కోటిరెడ్డి, సర్పంచులు ఇస్రం నగేశ్, ఆంగోతు కోట్యానాయక్ పాల్గొన్నారు.
త్రిపురారం : మండల కేంద్రంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రైతు వేదికలో ఉత్తమ రైతులను రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రామ్చందర్నాయక్ సన్మానించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, నాయకులు మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, కామెర్ల జానయ్య, ధనలక్ష్మి, సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, పెద్దబోయిన శ్రీనివాస్యాదవ్, వెంకటాచారి, వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ జయరాంనాయక్, సర్పంచులు పాల్గొన్నారు.
నందికొండ : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ కర్న అనూషారెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్ మంగ్తానాయక్, నాయకులు గుజ్జుల కొండలు, భూషరాజుల కృష్ణ, చంద్రయ్యయాదవ్, శ్రీను, సురేశ్, జానకి, విష్ణుమూర్తి పాల్గొన్నారు.