చౌటుప్పల్, అక్టోబర్ 4 : గొల్లకురుమల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండబోయిన అయోధ్యయాదవ్ అన్నారు. యాదవులకు గొర్రెల పంపిణీ నగదును బదిలీ చేయడాన్ని హర్షిస్తూ మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడడుతూ దసరా కానుకగా యాదవుల అక్కౌంట్లలోకి డబ్బులు బదిలీ చేయడం హర్షణీయమన్నారు. సంఘం మండలాధ్యక్షుడు గుండబోయిన వెంకటేశ్యాదవ్, నాయకులు నల్ల గణేశ్, దంటిక శంకర్, నల్ల పర్వతాలు, గుండబోయిన ఇస్తారి, పాక రమేశ్, హరిప్రసాద్, అంజయ్య పాల్గొన్నారు.
మర్రిగూడ : రాష్ట్రంలోని గొల్లకురుమల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్యాదవ్ అన్నారు. గొర్రెల సబ్సిడీ యూనిట్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ గొల్లకురుమల సంఘాల ప్రతినిధులతో కలిసి టీఆర్ఎస్ నేతలు మంగళవారం మర్రిగూడ చౌరస్తాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంభం నర్సమ్మామాధవరెడ్డి, మాడెం వెంకటయ్య, పాక నగేశ్, దళితబంధు జిల్లా డైరెక్టర్ లపంగి నర్సింహ, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు మారగోని రామన్న, నాయకులు కొట్టం శివయాదవ్, వల్లపు సైదులుయాదవ్, మెగావత్ లాలూనాయక్, రొక్కం భాస్కర్రెడ్డి, నీల శంకరయ్య, బాలం జంగయ్య, రాపోలు యాదగిరి, సంకబుడ్డి నర్సింహ, నున్సావత్ గోపీనాయక్, పల్లె యాదగిరి, గ్యార యాదయ్య పాల్గొన్నారు.