యాదాద్రి, సెప్టెంబర్ 24 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. స్వామివారిని సుమారు 9,730మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 12,06,811 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రీశుడిని స్వీడన్ దేశానికి చెందిన ఖాయ్, కరీనా దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం యాదాద్రి ఆలయాన్ని వారు పరిశీలించారు. యాదాద్రి ఆలయం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
సర్వ దర్శనాలు: ఉదయం 7.00 నుంచి 9.00 గంటలవరకు, 10.00 నుంచి 11: 45, మధ్యాహ్నం 12.30 నుంచి 3.00, సాయంత్రం 5.00 నుంచి 7.30 గంటల వరకు, రాత్రి 8.15 నుంచి 9.00 గంటల వరకు. వీఐపీ దర్శనాలు ఉదయం 9.00 నుంచి 10.00 గంటల వరకు, సాయంత్రం 4.00 నుంచి 5.00.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 89,900
వీఐపీ దర్శనాలు 75,000
వేద ఆశీర్వచనం 3,600
సుప్రభాతం 1,100
ప్రచారశాఖ 8,750
వ్రత పూజలు 19,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 11,600
ప్రసాద విక్రయం 6,70,850
వాహనపూజలు 8,400
అన్నదాన విరాళం 9,669
సువర్ణ పుష్పార్చన 55,548
యాదరుషి నిలయం 26,544
పాతగుట్ట నుంచి 10,150
కొండపైకి వాహన ప్రవేశం 2,50,000
లక్ష్మీ పుష్కరిణి 600
శివాలయం 3,600
ఇతర విభాగాలు 1,300