అతడికి పుట్టుక నుంచే పోలియో రావడంతో కుడి కాలు పడిపోయి దివ్యాంగుడిగా మారాడు. అయినా.. ైస్థెర్యం కోల్పోకుండా చదువు, ఆటలపై శ్రద్ధ పెట్టి రాణిస్తున్నాడు. పీజీ పూర్తి చేసిన అతను.. వీల్చైర్ బాస్కెట్బాల్, క్రికెట్లో రాణిస్తూ శభాష్ అనిపించుకున్నాడు. అనేక బహుమతులు గెలుచుకొని పలువురి ప్రశంసలు అందుకొని యువతకు స్ఫూర్తిగా నిలిచాడు చందంపేట మండలం గన్నెర్లపల్లి తండాకు చెందిన రమావత్ కోటేశ్వర్.
చందంపేట, నవంబర్ 28 : గన్నెర్లపల్లి తండాకు చెందిన రమావత్ తావుర్య-భారతిది నిరుపేద కుటుంబం. వారి కుమారుడు కోటేశ్వర్ చిన్నప్పుడు పోలియో బారిన పడి దివ్యాంగుడయ్యాడు. అయినా మనోధైర్యంతో 10వ తరగతి వరకు దేవరకొండలో, ఇంటర్ హైదరాబాద్లో చదివాడు. 2016లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాడు. చదువుకుంటూనే ఆటలపై దృష్టి సారించాడు. వీల్చైర్ బాస్కెట్బాల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించాడు. 2019లో థాయ్లాండ్లో జరిగిన పారా ఒలింపిక్స్లో ఇండియా జట్టు నుంచి పాల్గొని ప్రథమ బహుమతి సాధించాడు. అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టులో రాజస్థాన్, గుజరాత్లో జరిగిన జాతీయ స్థాయి వీల్చైర్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర జట్టులో అతను ఉన్నాడు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి డిసెంబర్ 2, 3 తేదీల్లో ముంబయిలో జరుగనున్న వీల్చైర్ క్రికెట్ ట్రై సిరీస్కు ఎంపికయ్యాడు. ఆ పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక సాయం కోరుతున్నాడు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ రూ.3వేలతోనే జీవనం గడుపుతున్నా. పోటీల్లో వివిధ రాష్ర్టాలకు వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. వచ్చే నెల 2, 3 తేదీల్లో ముంబయిలో జరిగే ట్రై సిరీస్కు ఎంపికయ్యా. అక్కిడికి వెళ్లేందుకు డబ్బుల్లేవు. దాతలు ఆదుకోవాలి. సంప్రదించాల్సిన ఫోన్ నం.9666847416, ఎస్బీఐ అకౌంట్ నంబర్ 62115077064, దేవరకొండ బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ కోడ్ : SBIN0020179.