రామన్నపేట, జూన్ 29 : పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని మునిపంపుల, ఇంద్రపాలనగరం గ్రామాల్లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు వార్డులల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలు గ్రహించాలని, అభివృద్ధి చేసే వారికి అండగా ఉండాలని సూచించారు. తెలంగాణకు నిధులివ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ప్రధాని మోదీ ఏ మొహం పెట్టుకొని రాష్ర్టానికి వస్తున్నారని ప్రశ్నించారు.
ఇంద్రపాలనగరంలో అంబేద్కర్ భవన ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సర్పంచులు కాటేపల్లి సిద్ధమ్మాయాదయ్య, యాదాసు కవితాయాదయ్య, ఎంపీటీసీలు గాదే పారిజాతాముకుందం, పూస బాలమణీ నర్సయ్య, సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్కమిటీ వైస్చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుత్తా నర్సింహారెడ్డి, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, పీఆర్ఏఈ గాలయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఆమేర్, ఉప సర్పంచ్ గర్దాసు సురేశ్, గ్రామశాఖ అధ్యక్షులు గర్దాసు విక్రం, మామిండ్ల అశోక్, నాయకులు పున్న జగన్మోహన్, పోచబోయిన మల్లేశం, నిమ్మగడ్డ పద్మారావు, రవ్వ నర్సింహ, పోతరాజు సాయికుమార్, బద్దుల రమేశ్, బత్తుల వెంకటేశం, మిర్జా ఇనాయతుల్లాబేగ్, జానకిరాములు, శ్రీను పాల్గొన్నారు.