భువనగిరి కలెక్టరేట్, మే 19 : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని మంత్రి హరీశ్రావు సందర్శించనున్నారు. 11:40గంటలకు భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో టీ డయాగ్నస్టిక్ సెంటర్ పనులకు శంకుస్థాపన చేస్తారు.
32 పడకల ఇంటెన్సివ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్ (ఐపీసీయూ), 20 పడకల అధునాతన నవజాత శిశువు స్థిరీకరణ యూనిట్ (ఎన్బీఎస్యూ)ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30గంటలకు కలెక్టరేట్లో జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది, గైనకాలజిస్ట్లు, ఆర్థోపెడిక్ వైద్యులు, డ్రగ్ కంట్రోల్, ఆహార భద్రత, ట్రెజరీ, ఆడిట్ శాఖల అధికారులతో, మధ్యాహ్నం 1:30గంటలకు ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్ట్లతో సమీక్ష నిర్వహిస్తారు. 2:30 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయల్దేరుతారని కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఏవీ.కిరణ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని ఆహ్వానించేందుకు నిర్వహించే బైక్ ర్యాలీలో నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.