రామగిరి, జూలై 27 : కోమలి కళా సమితి నల్లగొండ ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ హైదరాబాద్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సౌజన్యంతో నల్లగొండ జిల్లా కేంద్రంలోని చిన వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో మూడ్రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు బుధవారం రాత్రి ముగిశాయి. చివరి రోజు తొలుత ఎస్బీఐ హైదరాబాద్ ఆధ్వర్యంలో పేరిణి నృత్యం చేశారు.
అనంతరం కోమలి కళా సమితి ఆధ్వర్యంలో రచయిత తులసి బాలకృష్ణ, దర్శకత్వం డా॥ వెంకట్గోవాడ పర్యక్షణలో ‘అన్నట్టు మనం మనుషులం కదూ..?’నాటిక ఎంతో ఆలోచింప జేసింది. మనిషి విశిష్టతను తెలిపింది. అదే విధంగా మిత్ర క్రియేషన్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘అందిన ఆకాశం’ నాటికను పదర్శించారు. చివరి రోజు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి హాజరై కళకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవులు, కళాకారులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎంతో ఆదరణ కల్పిస్తున్నాని తెలిపారు.
మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కళాకారులను ఆహ్వానించి నాటలు వేయించిన కోమలి కళా సమితి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు పోశం రఘుపతి, ప్రధాన కార్యదర్శి ఎంఎల్ నర్సింహారావు, సభ్యులు డా॥ లింగనబోయిన లేఖానంద స్వామి, వి.భాస్కర్, ఎం.శ్రీకాంత్బాబు, జీఎల్ కుమార్, అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శి పెందోట సోము, పంకజ్యాదవ్, రావుల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.