నల్లగొండ: సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని మాజీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. వివిధ ఆనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న 51మంది నిరుపేద కుటుంబాలకు జిల్లా కేంద్రం
లోని తన క్యాంపు కార్యాలయంలో 19,83,500 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు, తిప్పర్తి జడ్పీటీసీ, టీఆర్ఎస్ జడ్పీ ఫ్లోర్లీడర్ పాశం రాంరెడ్డి పాల్గొన్నారు.