చండూరు, అక్టోబర్ 7 : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దాంతో నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గులాబీ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. చండూరు మండలంలోని తుమ్మలపల్లి రామలింగేశ్వరస్వామి దేవాలయంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు భూతరాజు దశరథ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు ఉజ్జిని అనిల్రావు శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కోడి వెంకన్న, పార్టీ నాయకులు పెద్దగోని వెంకన్న, మధుసూదన్రావు, మల్లారెడ్డి, సురేందర్రెడ్డి, శేఖర్, సుదర్శన్, జనార్దన్, వెంకన్న, దశరథ, శ్రీను, రవి, వెంకన్న, సైదులు పాల్గొన్నారు.
నాంపల్లి : మండల కేంద్రంతోపాటు ఎస్డబ్ల్యూ లింగోటం గ్రామంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. మండల కేంద్రంలో ఆ పార్టీ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో నాంపల్లి సత్తయ్య, జెల్లెల సైదులు, సుందనబోయిన పర్వతాలు, గౌరు కిరణ్, నాంపల్లి సంజీవ, ఎదుళ్ల సుందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు. పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమ, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి, పార్టీ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి గుత్తా ప్రేమ్చందర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మునుగోడు : మండల కేంద్రంలో పటాకులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, ఎంపీటీసీలు బొడ్డు శ్రావణి, ఈద నిర్మలాశరత్బాబు, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే భాస్కర్రావు
చౌటుప్పల్, అక్టోబర్ 7 : మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకేనని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ కూసుకుంట్లను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ చౌటుప్పల్ పట్టణంలో పార్టీ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ కూసుకుంట్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్లు నిధులు తీసుకొచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్రెడ్డి, మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్, నాయకులు వెంకటేశ్యాదవ్, బాబాషరీఫ్, బాలకృష్ణగౌడ్, పరమేశ్ పాల్గొన్నారు.