బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 10 : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన నివాసంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ శనివారం కలిశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ 65ను మల్కాపూర్ నుంచి నందిగామ వరకు సూర్యాపేట మీదుగా అరు లైన్లు కలిగిన రోడ్డుగా వెంటనే విస్తరించాలని కోరారు.
ప్రమాద హెచ్చరికలు కలిపి(బ్లాక్ స్పాట్ 17) మునుగోడు, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వరకు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా ధర్మోజిగూడెం నుంచి ఎల్లగిరి వరకు కొత్త సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్హెచ్ -65 మల్కాపూర్ నుంచి నందిగామ వరకు అండర్ పాస్లు, అలాగే జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు వెంట డ్రైనేజీని వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.