కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఒక్క గేటు ద్వారా మంగళవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 796.39 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. గేటు ద్వారా 648.11 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు
కలిపి 49 క్యూసెక్కులు వెళుతుండగా, 45 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)ప్రస్తుతం 644.50 అడుగులు(4.33 టీఎంసీలు)ఉన్నట్లు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.