రామగిరి, ఏప్రిల్ 19 : నాడు సమాజంలో అసమానతలు రూపుమాపి ఎంతోమంది ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన పూలే, అంబేద్కర్, జగ్జీవన్రామ్ భావనలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ప్రతి సంవత్సరం ఆ మహనీయుల జయంతి, వర్ధంతులు నిర్వహించి పూలమాలలు వేయడం కాదని, వారి భావనలు సమాజంలోకి తీసుకెళ్లి వ్యాప్తి చేయడమే నిజమైన నివాళి అవుతుందన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బుధవారం వర్సిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే, అంబేద్కర్, జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తొలుత మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం ఆయన తన మాట-పాటలతో విద్యార్థుల్లో స్ఫూర్తినింపారు. సమాజాన్ని మానవీకరించే అద్భుత సాధనం అంబేదరిజం అని కొనియాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవ హకులు, సామాజిక న్యాయం సూత్రాల ఆధారంగా ఒక సమ్మిళిత సమాజం వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. సామాన్య నేపథ్యాల నుంచి వచ్చిన ముగ్గురు నాయకులు అసామాన్యమైన ప్రతిభా పాటవాలు, త్యాగాలతో ఒక కొత్త పంథాని సృష్టించారని పేర్కొన్నారు. విద్యార్థులు వారి జీవితాలను అధ్యయనం చేసి స్ఫూర్తిని పొంది ముందుకు సాగాలని సూచించారు. అంబేదర్ను నేడు ప్రపంచం విశ్వవిజ్ఞాన మూర్తిగా కీర్తించడం మన దేశానికే గర్వకారణమన్నారు.
నేడు దేశంలో సమస్త అస్తిత్వాలకు అంబేదర్ సిద్ధాంతం ఒక దిక్సూచి, ప్రేరణగా నిలిచిందన్నారు. సమాజ మార్పునకు విద్య ఆవశ్యకతను వివరిస్తూ పూలే, సావిత్రీబాయి పూలే త్యాగాలను కొనియాడారు. విశిష్ట అతిథిగా హాజరైన అధ్యాపకుడు, ఎంజీయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ కోయ కోటేశ్వర్రావు మాట్లాడుతూ మూర్తిని కాదు వారి స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని సూచించారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అవరోధాలను ఎదిరించి ఎలా ఎదగాలో మహనీయుల జీవితాలు మనకు చకని సందేశం అన్నారు.
భారత సమాజం అందరికీ వడ్డించిన విస్తరి కాదు అని.. పాదాలు నెత్తురోడుతున్న బాటలు వేసిన మహనీయుల చరిత్ర చదివితే మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుందన్నారు. ప్రముఖ కవి, రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్, పూలే సమాజానికి చేసిన సేవలను వివరించారు. ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ చొల్లెటి గోపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిజిస్టార్ ప్రొఫెసర్ తుమ్మ కృష్ణారావు, ఓఎస్డీ ప్రొఫెసర్ అల్వాల రవి, వర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ మద్దిలేటి, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ మిరియాల రమేశ్, మైనారిటీ సెల్ డైరెక్టర్ డాక్టర్ సబీనా హెరాల్డ్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కామర్స్ అండ్ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆకుల రవి, వివిధ విభాగాల అధిపతులు సరిత, మాధురి, చిల్కూరి రమేశ్, భిక్షమయ్య, ఎన్ఎస్ఎస్ విభాగం జూనియర్ అసిస్టెంట్ హరికిషన్రావు, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.