నకిరేకల్, ఫిబ్రవరి 18 : గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని నెల్లిబండలో బొడ్రాయి, ముత్యాలమ్మ, కోట మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం బొడ్రాయి వద్ద గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారు జాము నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
గ్రామ మహిళలు బొడ్రాయి చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేసి ముత్యాలమ్మ దేవతకు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని ఆకాక్షించారు. కార్యక్రమాలలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్రెడ్డి, చామల శ్రీనివాస్, మర్రి వెంకటయ్య, దైద రవీందర్, దాతలు యానాల మధుసూదన్రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నాయకులు కందాల ప్రమీల, ఏర్పుల తాజేశ్వర్, వంటెపాక వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.