దేవరకొండరూరల్, నవంబర్16: ఎన్నికల వేళ కనిపించే కాంగ్రెసోళ్లను నమ్మవద్దని, వారు చేసేదేమీ లేదని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హెచ్చరించారు. మండలంలోని ఇద్దంపల్లి, ఎల్లారెడ్డిబావి, పాత్లావత్తండా’ (పి), పాత్లావత్తండా(టి), పడమటిపల్లి, జిల్లపల్లి, తూర్పుపల్లి, సభావట్తండా, కొమ్మెపల్లి, కొండభీమనపల్లి, పెద్దతండా, శేరిపల్లి, రత్యతండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానికులు, గిరిజనులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతర ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ పదేండ్లలో కరెం టు, నీటి కష్టాలు తీరాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు.
పని చేసేవారిని గెలిపించి, ప్రగతికి బాటలు వేయాలని సూచించారు. గ్రామాల్లో వీధుల వెంట తిరుగుతూ మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా ప లుకరించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే సీఎం కేసీఆర్ వస్తేనే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయని చెప్పారు. కాంగ్రెసోళ్లు 60 ఏండ్లలో తెలంగాణను ఆగం చేసి ఇప్పుడు ఏంచేస్తారని ప్రశ్నించారు.
ఆ పార్టీ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు. కారు గుర్తు ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు కేతావత్ బిల్యానాయక్, నేనావత్ కిషన్నాయక్, వెంకటేశ్గౌడ్, జెడ్పీటీసీ సలహాదారు మారుపాక సురేష్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్రెడ్డి, వైస్ఎంపీపీప చింతపల్లి సుభాష్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు టీవీయన్రెడ్డి, రమేష్నాయక్, ఎంపీటీసీ నూతనఘంటి సైదమ్మరఘు, సర్పంచ్లు విద్యావతి వెంకట్రెడ్డి, లోకసాని సరితాశ్రీనివాస్రెడ్డ్లి, దస్రూ పాల్గొన్నారు.
దేవరకొండ: మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని 11వ వార్డులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఏకమవుతున్న శత్రువుల నాటకాలకు రాబోయే రాబోయే 14రోజుల పాటు నిరంతరంగా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పని చేసి తిప్పికొట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అందించే పథకాలు, మ్యానిఫెస్టోను ప్రతి ఒక్కరికి వివరించే బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేప్పే మాటలు నీటి మూటలు అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు.
రాష్ట్రం కోసం 14ఏండ్ల పాటు కొట్లాడి తెచ్చిన తెలంగాణను ఈ పందేండ్లలో అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. ఈ అభివృద్ధి పరుగులు ఆగకుండా ఉండాలంటే మళ్లీ కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలు మాటలకే పరిమితమని విమర్శించారు. రైతుబంధు రూ.16వేలు, గ్యాస్ సిలిండెర్ ధర రూ.400, సౌభాగ్యలక్ష్మి పథకంతో రూ.3వేలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. దేవరకొండలో కారు గుర్తుకు ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యనాయక్, హన్మంత్ వెంకటేశ్గౌడ్, జెడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేష్గౌడ్, వైస్ చైర్మన్ రహత్అలీ, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు టీవీఎన్రెడ్డి, కౌన్సిలర్ తస్కిన్ సుల్తానా, ఎర్ర కృష్ణజాంబవ్, వేముల రాజు, గాజుల అంజనేయులు, బొడ్డుపల్లి కృష్ణ, మైబెల్లి, సోఫీ తదితరులు ఉన్నారు.