దేవరకొండ, అక్టోబర్ 30 : దేవరకొండ పట్టణంలో మంగళవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పట్టణ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు సమీపంలోని మైదానంలో జరిగే సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ నుంచి 80 వేల మంది హాజరు కానున్నట్లు చెప్పారు.
కొంత మంది నాయకులు తమ స్వార్థం కోసం ఇతర పార్టీల్లో చేరినంత మాత్రాన బీఆర్ఎస్కు వచ్చే నష్టమేమీ లేదన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్అలీ, కౌన్సిలర్ వీరమోని అంజిగౌడ్, నీల రవికుమార్, పొన్నబోయిన సైదులు, మహ్మద్ రైస్, జయప్రకాశ్నారాయణ, తౌఫిక్ఖాద్రి, ఉప్పల శ్రీను, సత్తార్, ఇలియాస్, జయలక్ష్మి, సత్యనారాయణ ఉన్నారు.
దేవరకొండ : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ చేరుతున్నారని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ మండలం జటావత్ తండాకు చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు ఏం చేశారని ఓట్లు వేయాలో ఆ పార్టీ నాయకులను నిలదీయాలని సూచించారు. దేవరకొండ ఖిలాపై మరోమారు గులాబీ చెండా ఎగుర వేసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేశ్గౌడ్, ఎంపీటీసీ బద్యానాయక్, నాయకులు ఎరుకలి యాదయ్య, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి: దేవరకొండలో మంగళవారం జరిగే సీఎం కేసీఆర్ సభకు మండలం నుంచి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని పార్టీ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. సీఎం సభకు మండలం నుంచి సుమారు 10వేల మంది బయల్దేరి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
దేవరకొండ : కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెప్పి తమ పార్టీలో చేర్చుకున్న మండలంలోని జిల్లపల్లి సర్పంచ్ ఎటెల్లి వెంకటయ్యతో పాటు మరో 20 మంది సోమవారం ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, బీఆర్ఎస్ నాయకుడు గుత్తా అమిత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంత మంది నాయకులు తమ స్వలాభం కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లి బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మి ఎవరూ మోస పోవద్దని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.