భూదాన్ పోచంపల్లి ఏప్రిల్ 17 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన 29మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు, రంజాన్ పండుగ సందర్భంగా 150మంది ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు పోచంపల్లి పట్టుచీర, దోతి, టవల్ అందించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సర్వమత సంప్రదాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు. రంజాన్ పవిత్ర మాసంలో ఎంతో నిష్టతో ఉపవాసాలు ఉంటున్న ముస్లింలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రంజాన్ వేడుకను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
10 మంది బీఆర్ఎస్లో చేరిక
మండలంలోని రామలింగంపల్లి తండాకు చెందిన వివిధ పార్టీల నుంచి 10మంది కార్యకర్తలు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పోచంపల్లి పెద్ద చెరువులోని పూడికతీతను కొనసాగించాలని, నేల తూము నిర్మాణం, గుంతలు లేవల్ చేయుట, ప్రస్తుతం పోసిన కట్టను తీసివేయాలని రైతు సంఘం నాయకులు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, తాసీల్దార్ వీరభాయి, ఎంపీడీఓ బాలశంకర్, మున్సిపల్ కమిషనర్ భాసర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్యాదవ్, ఎంపీటీసీ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు బత్తుల మాధవీశ్రీశైలంగౌడ్, సామ రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పాటి సుధాకర్రెడ్డి, చిలువేరు బాలనర్సి ంహ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రావుల శేఖర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మారెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు గునిగంటి మల్లేశంగౌడ్, సీత శ్రవణ్, చింతకింది కిరణ్, రైతులు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
భూదాన్పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పోచంపల్లి పట్టణంలోని భావనరుషి పేటకు చెందిన గుజ్జ యాదగిరికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.3.50లక్షల చెక్కును ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సోమవారం అందించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అనారోగ్యం బారిన పడిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందన్నారు.