మునుగోడు, మే 06 : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన పేదింటి విద్యా కుసుమం దుబ్బసాయి శ్రీ వర్షిత్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో వృత్తి విద్య కోర్సు (ఎంఎల్టీ) పూర్తి చేశాడు. 991/1000 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసానికి విద్యార్థిని పిలిపించుకుని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.