హాలియా, నవంబర్ 30: నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు సాగిం ది. అనుముల మండలం ఇబ్రహీంపేట ఎమ్మె ల్యే నోముల భగత్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. ఎలాంటి సంఘటనలు జరగకపోవ డంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చు కున్నారు. చివరి సమయంలో ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
త్రిపురారం: మండలంలోని 32 గ్రామాల్లో 48 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పో లింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మండలం లోని సత్యంపాడులో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ కుటుంబసభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దదేవులపల్లి, నర్లకంటివారిగూడెం, బాబు సాయిపేట, త్రిపురారం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సందర్శించారు. పోలింగ్ సరళిని అధికారు లను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే సతీమణి నోముల భవాని కూడా మండలంలోని సత్యనారా యణపురం, అంజ నపల్లి, నీలాయగూడెం, రాగడప, కాపువారిగూ డెం, కుంకుడుచెట్టుతండా తదితర గ్రామాలను సందర్శించారు. వృద్ధులు, మహిళలు తమ ఓటు హక్కును విని యోగించుకోవడానికి పురుషుల కంటే ఎక్కువగా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఉన్న మహిళ పోలిం గ్ కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేశామని మహిళలు తెలిపారు.
నందికొండ: నందికొండ మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ప్రారంభంలో హిల్కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 103 పోలింగ్ బూత్లో ఈవీఎం కొద్ది సేపు మోరాయించింది. పైలాన్కాలనీలో 6230 గాను 3835, హిల్కాలనీలో 7075 గాను 3841మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నందికొండ మున్సిపా లిటీలో 14 బూత్లలో పోలింగ్ లలో 57.69 శాతం ఓటింగ్ నమోదైంది.
తిరుమలగిరి(సాగర్): మండలంలోని పెద్దబాయి తండా, పిల్లిగుం డ్లతండా, గోడుమడక, తిరుమలగిరి గ్రామాల్లో సాయంత్రం 6.30గంటల వరకు పోలింగ్ కొనసాగింది. బోయగూడెంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.