మాల్, ఫిబ్రవరి 19: అన్ని గ్రామాలు, తండాలు అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. చింతపల్లితో పాటు మండలంలోని తీదేడు, మల్లారెడ్డిపల్లి, నెల్వలపల్లి, గొడకొండ్ల, ప్రశాంతిపురితండా, చాకలి శేరిపల్లిలోని సీసీ రోడ్లకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో మిగిలిన అన్ని పనులను పూర్తి చేసి గ్రామాలు, పట్టణాలు, తండాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండూరి భవానీపవన్కుమార్, ఎంపీడీఓ సుజాత, ఏఈ జీవన్సింగ్, నాయకులు కాయితీ జితేందర్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, అంగిరెకుల నాగభూషణం, ఎ.గోవర్ధన్, సంజీవరెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.
చందంపేట : గాగిళ్లాపురం సీతారామచంద్రస్వామి ఆలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులను ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బాలూనాయక్ను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ పార్వతీచందునాయక్, పీఏసీఎస్ చైర్మన్ జాలె నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముక్కామల వెంకటయ్యగౌడ్, వైస్ చైర్మన్ యాదగిరిరావు, నాయకులు శ్రీశై లం యాదవ్, కిన్నెర హరికృష్ణ, ఎంపీటీసీ రజితారామకృష్ణారెడ్డ్డి, మాజీ ఎంపీటీసీ గడ్డం వెంకటయ్య, నారాయణరెడ్డి, సుజిత్కుమార్, ఆనంద్, సుధాకర్, కృష్ణయ్య, యాదయ్య, సతీశ్ ఉన్నారు.