మిర్యాలగూడ, నవంబర్ 24: బీఆర్ఎస్ సర్కారులోనే మైనార్టీల సంక్షేమం అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని రామచంద్రగూడెం, సీతారాంపురం, షాబునగర్ ప్రాంతాల్లోని మసీదు ప్రాంగణాల్లో ముస్లిం మైనార్టీలను ఎమ్మెల్యే భాస్కర్రావు కలిసి ముస్లిం మత పెద్దలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ మైనార్టీలను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుతున్నారని తెలిపారు.
మైనార్టీల విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి, విదేశీ విద్యకు సాయం అందిస్తున్న ఘనత బీఆర్స్ ప్రభుత్వానిదే అని అన్నారు. కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బంటు శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఖాజా మోయినొద్దిన్, మదార్బాబా, జొన్నలగడ్డ రంగారెడ్డి, జడ్పీకోఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, కరీం, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ మ గ్ధుంపాషా, మత పెద్దలు పాషా, అహ్మద్చావుష్, ము ఫ్తీ ఇమ్రాన్, ముఫ్తీ అక్రమ్, కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు సామ వెంకన్న, కాంగ్రెస్ సీనియర్ నా యుడు పోతురాజు ప్రవీణ్కుమార్ శుక్రవారం పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే భాస్కర్రావు బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ ఎస్లోకి చేరుతున్నట్లు తెలిపారు. నిమ్మల నవీన్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, పోకల రాజు, భిక్షంగౌడ్, సుందర్, సామ చిన్నవెంకన్న పాల్గొన్నారు.