నల్లగొండ, అక్టోబర్ 27: అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం నల్లగొండ పట్టణంలోని 35,36,37వ వార్డుల్లో ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను నల్లగొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి నిత్యం ప్రజల కష్టాలు తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండను రూ.1,450 కోట్లతో అభివృద్ధ్ది చేస్తున్నానని మరో రెండేండ్లలో ఆ పనులు పూర్తి అయ్యే అవకాశం ఉన్నందున మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి గెలిపించాలని కోరుతూ ఆయా కాలనీల్లో ప్రజలు కంచర్ల భూపాల్ రెడ్డి చేపడుతున్న ప్రచారానికి అపూర్వ స్వాగతం లభిస్తుంది. ప్రధానంగా మహిళలు హారతులు ఇస్తూ నీరాజనం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయం త్రం వేళలో చేపట్టే ప్రచారానికి కాలనీల నుంచి విశేష స్పందన లభిస్తుండగా డప్పు చప్పుళ్ల కాలనీల్లో ప్రచారం ఉర్రూతలూగిస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి, వెంకన్న, మాజీ కౌన్సిలర్ మిర్యాల యాదగిరి, తరాల యాదగిరి, చక్రవర్తి, రాజేందర్, సిం గిరి కొండ శివశంకర్, శ్యాంసుందర్, దోనాల నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.