నార్కట్పల్లి జనవరి 13: చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. శుక్రవారం ఆయన చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, కల్యాణ వేదిక స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి నిర్వహి ంచే ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అధికారులు, ఆలయ సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
భక్తుల సౌకర్యార్ధం కల్యాణ వేదిక మండపం కింద ఏర్పాటు చేయాలన్నారు. స్వామివారి కల్యాణం, తలంబ్రాలు తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నందున మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మరో 4 రోజుల్లో గుట్టపైకి వస్తానని పెండింగ్లో ఉన్న పనులు ఏమైనా ఉంటే పూర్తి చేయాలని పనుల్లో జాప్యం ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, డీఎస్పీ నర్సింహా రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఆలయ ఈఓ నవీన్, సర్పంచ్ మల్గ బాలకృష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, కొండూరు శంకర్, కమ్మంపాటి వెంకన్న, మేడి శంకర్, ఒంపు శివ, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.