నార్కట్పల్లి నవంబర్ 17: నిత్యం ప్రజల మధ్యే ఉండే తనకు మరోసారి అవకాశమిచ్చి గెలిపించాలని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఓటర్లను కోరారు. మండలంలోని తొండల్వాయి, జువ్విగూడెం, నెమ్మాని గ్రామాల్లో శుక్రవారం జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ పాలనలో మరెన్నో పథకాలు అందరికీ అందుతాయని అన్నారు.
కాంగ్రెస్ ఇస్తున్న మోసపూరిత గ్యారెంటీ హామీలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. మండలంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అనేక సమస్యలను పరిష్కరించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీ మారానే తప్ప స్వలాభాల కోసం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు మోటార్లకే పరిమితమైందని సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరింది. నార్కట్పల్లి పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చి దిద్దానన్నారు. విద్యార్థుల కోసం నార్కట్పల్లిలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయించానని, మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
మండలంలోని గ్రామాల్లో జడ్పీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు ఎమ్మెల్యేకు బొట్టు పెట్టి హారతులు పట్టి స్వాగతం పలికారు. గ్రామాల్లో కోలాటాలు నృత్యాలతో పటాకులు కాలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, చింతల సోమన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు
పాల్గొన్నారు.
ట్యాల: ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని, అభివృద్ధి నిరోధకులకు ఓటు వేయవద్దని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఆయన తాళ్లవెల్లంల, వేంబావి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆ యా గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్దిని వివరిస్తూ ఓట్లు అభ్యర్ధించారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తేనే అభివృద్ధ్ది, సంక్షేమం సమపాళ్లలో జరుగుతాయని ఓటర్లకు తెలిపారు. అనంతరం జరిగిన సభలలో మా ట్లాడుతూ ఐదేండ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏనాడు అభివృద్దిని పట్టించుకోని మనిషి మరో ఐదేళ్లు పార్టీలో ఉండి పార్టీ అభివృద్దికి, ప్రజల బాగుకోసం ఆలోచించని వ్యక్తి ఇప్పుడు స్వార్ధంతో పార్టీ మారి మళ్లీ తనను గెలిపించాలని అడగడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
నిరంతరం కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండే తాను ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కనీసం ఎమ్మెల్యేగా గుర్తించకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పార్టీ మారి అభివృద్ధ్ది కోసమే పనిచేస్తున్నానని వివరించారు. ప్రజల్లో తనకు పెరుగుతున్న ఆదరణ చూసి గెలుపు ఖాయమని భావించిన కోమటిరెడ్డి సోదరులు తనను ఓడించడానికి కుట్రలు పన్నుతున్నారని, తన అనుచరులను అక్రమ పారీ ్టఫిరాయింపులకు సిద్ధం చేస్తూ తప్పుడు రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు.
ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో మరోసారి అలజడులు లేపడానికి కాంగ్రెస్ అభ్యర్థ్ది కోమటిరెడ్డి సోదరులతో కలిసి సిద్ధమయ్యాడని అలాంటి వ్యక్తికి ప్రజలే తగిన బుద్ధ్ది చెప్పాలని చిరుమర్తి పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కొలను సునీత, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షకార్యదర్శులు అయిలయ్య, కల్లూరి మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రుద్రారం భిక్షపతి, మాజీ జడ్పీటీసీ శేఫూరి రవీందర్, నాయకులు పల్లపు బుద్దుడు, కర్నాటి ఉప్పల వెంకట్రెడ్డి, జనగాం నర్సింహ, నక్క జానయ్య, మర్ల రాంరెడ్డి, దశరథ, జలంధర్రెడ్డి, కూనూరు సంజయ్దాస్, సత్తయ్య ఉపసర్పంచు భాస్కర్రావు, గునగంటి యాదయ్య, ప్రసాద్ రమేశ్డ్డి పాల్గొన్నారు.