మిర్యాలగూడ, ఏప్రిల్ 7: వంద మాటల కన్నా ఒక్క పాట ద్వారా సమాజంలో మార్పును తీసుకురావచ్చని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఐఎంఏ హాల్లో ఆదివారం మిర్యాలగూడ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
సాంస్కృతిక పునరుజ్జీవం నుంచి మొదలుకొని నేటి సమాజం వరకు అనేక మార్పులకు కళారంగమే దోహద పడిందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాసచారి, కందుకూరి సుదర్శన్, సత్యనారాయణచారి, ఏలె సత్యనారాయణ, సరస్వతి, మౌనిక, అంబటి నాగయ్య, కస్తూరి ప్రభాకర్, కొండల్రెడ్డి, దాసరి రమణ, లక్ష్మయ్య, వంగాల సైదాచారి, సత్యపైళ్ల పాల్గొన్నారు.