మిర్యాలగూడ, నవంబర్ 22 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని సకల జనుల సంక్షేమానికి భరోసా ఏర్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రకాశ్నగర్, నందిపహాడ్, అహ్మద్పుర, ఇస్లాంపుర, శాంతినగర్, సీతారాంపురం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రగతియాత్ర నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో గులాబీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున కదలివచ్చి ప్రచారంలో భాగస్వాములయ్యారు. మహిళా కోలాట బృందం ఎమ్మెల్యేకు స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాల ప్రజలు గౌరవ ప్రదంగా ఉండడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
అందులో భాగంగానే మిర్యాలగూడ మున్సిపాలిటీలో సంత్సేవాలాల్, అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే భవనాల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ప్రతివార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి సౌకర్యాలను మెరుగుపర్చినట్లు చెప్పారు. వివిధ కుల సంఘాలకు, అసోసియేషన్లకు ఉచితంగా స్థలాలను కేటాయించినట్లు చెప్పారు. నల్లగొండ బైపాస్ జంక్షన్, రాజీవ్చౌక్, సుందరయ్య జంక్షన్, ఈదులగూడ బైపాస్, హనుమాన్పేట ఫ్లైఓవర్, తడకమళ్ల క్రాస్ రోడ్డు వద్ద అభివృద్ధి పనులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. మున్సిపాలిటీల్లో రూ.856.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.511.65 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
మున్సిపాలిటీలోని 8వ వార్డులో మొత్తం రూ.4.40 కోట్లతో, 9వ వార్డులో రూ.5కోట్లతో, 11వ వార్డులో రూ.9.82 కోట్లతో, 46వ వార్డులో రూ.3.60 కోట్లతో, 47వ వార్డులో రూ.2.86 కోట్లతో, 28వ వార్డులో రూ.3.79 కోట్లతో, 43వ వార్డులో రూ.3.45 కోట్లతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. మరో మారు బీఆర్ఎస్కు అధికారం ఇస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. తెల్ల రేషన్కార్డుపై సన్నబియ్యం, రూ.5లక్షల బీమా, రూ.400కే వంట గ్యాస్ సిలిండర్, రూ.15లక్షల వరకు కేసీఆర్ ఆరోగ్య రక్ష, సౌభాగ్య లక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ.3వేల భృతి, రైతుబంధు సాయం రూ.16వేలకు, ఆసరా పింఛన్లు రూ.5వేలకు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచనున్నట్లు తెలిపారు.
పదేండ్లుగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు పరిశీలించాలని, మరింత అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మాజీ వైస్ చైర్మన్ మగ్దూంపాషా, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్గౌడ్, నాయకులు మదార్బాబా, కమిలి భీమ్లానాయక్, కర్నె ఇందిర గోవిందరెడ్డి, అబ్ధుల్ సలీం, ఎండీ. ఖాదర్, ఐల వెంకన్న, తేలుకుంట్ల శేఖర్, పలారపు సత్యనారాయణ, గంగుల భిక్షం, జానిపాషా, కొంక కోటయ్య, కర్నాటి వినోద్, ఖాజా, చంటి, కోల నాగరాజు, రమావత్ బాలు, మొండికత్తి లింగయ్య, అంజి, శ్రీను పాల్గొన్నారు.