రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
సూర్యాపేటలో ఘనంగా అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం
సూర్యాపేట టౌన్, జూలై 1 : కని పెంచేది తల్లిదండ్రులైతే.. ఆపదలో వైద్యం అందించి పునర్జన్మను ప్రసాదించే దేవుళ్లు వైద్యులని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. కరోనా కాలంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యుల సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. శుక్రవారం అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం, ఐఎంఏ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వైద్యులను సత్కరించి వారి సేవలను కొనియాడారు. పోరాడి సాధించిన తెలంగాణలో నూతన మెడికల్ కళాశాలల ఏర్పాటుతో అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
నేడు మెరుగైన వైద్యం, విద్య ప్రజలకు మరింత చేరువయ్యాయని.. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కొనియాడారు. మెడికల్ కళాశాల వచ్చిన కొద్దికాలంలోనే ఎన్నో అవార్డులు సాధించి దేశవ్యాప్తంగా పేరుగాంచిందన్నారు. అనంతరం వైద్యులను శాలువా, బొకేలు, మెమొంటోలతో సత్కరించి, సిబ్బందికి గిప్టులు అందజేశారు. పలుచోట్ల జరిగిన ఈ వేడుకల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, పుట్ట కిషోర్, సత్యనారాయణ, డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శారద, జనరల్ ఆసుపత్రి సూపరెంటెండెంట్ మురళీధర్రెడ్డి, మాండన్ సుదర్శన్, డాక్టర్ రమేష్చంద్ర పాల్గొన్నారు.