రామగిరి: భారతదేశమని విభిన్న సంస్కృతులకు నిలయమని దీంతోనే ప్రపంచంలోని అన్ని దేశాల వారు ఇక్కడ ఉండ గలుగుతున్నారని ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి(ఐఎఫ్ఎస్) సి.రాజశేఖర్ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎంజీయూ వీసీ ప్రొ. సిహెచ్.గోపాల్రెడ్డి ఆయనకు ఘనంగా స్వాతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు.
తొలుత వీసీ ఛాంబర్లో సమావేశమై పలు అంశాలు చర్చించారు. తర్వాత ఆర్ట్స్ కళాశాల మీని సమావేశ మందిరంలో ఎంజీయూ వివిధ విభాగాల అధికారులు, అధ్యాపకులతో నిర్వహిం చిన సమావేశంలో ఆయన అందరిని పరిచయం చేసు కుని మాట్లాడారు. అంతార్జాతీయ దౌత్య సంబంధాలు సంక్లిష్టంగా ఉంటాయని వీటిని అమలు చేయడంలో ఓపిక ఎంతో అవసరమన్నారు. భారతదేశం శాంతియుత దేశం కాబట్టి అంతర్జాతీయ దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకోగల్గినట్లు తెలిపారు.
ఐఐటీ ఢిల్లీ విశ్రాంత ప్రొ. సుధాకర్ మాట్లాడుతూ మన విద్యార్థులకు మంచి శక్తి సామర్ధ్యాలు ఉన్నాయని వారికి సరైన శిక్షణ లభిస్తే సత్తాచాటుతారని వెల్లడించారు. ఎంజీయూలో స్థానిక అంశాలపై విద్యార్థులకు శిక్షణ అందించి అవగాహన పెంచి పరిశోధనలపై విద్యార్థులను వెళ్లేవిధంగా చూడాలన్నారు. అంతకుముందు తొలుత వీసీ ప్రొ. గోపాల్రెడ్డి మాట్లాడు తూ ఐఎఫ్ఎస్ రాజశేఖర్ మన నల్లగొండ జిల్లా వాసి కావడం గర్వకారణమన్నారు. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరం రాజశేఖర్ను, ప్రొ. సుధాక ర్లను వీసీ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎంజీ యూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డా. ఆకుల రవి, సీవోఈ డా. మిర్యాల రమేశ్, యూ నివర్సిటీ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్స్ డా. అంజిరెడ్డి, ఉపేందర్రెడ్డి, శ్రీలక్ష్మి, సుధారాణి, వివిధ విభాగాల అధికారులు, అధ్యాపకులు డా. అల్వాల రవి, ప్రేమ్సాగర్, వై.ప్రశాంతి, డా.చిల్కూరి రమేశ్, డా.భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాల అలూమినితో సమావేశం…
నల్లగొండలో నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బుధవారం మధ్యాహ్నం కళాశాల అలూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత దేశ విదేశాంగ విధా నం అనే అంశానికి ఐఎఫ్ఎస్ సి.రాజశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశ విదేశాంగ విధానంపై క్షుణంగా వివరించారు. సమావేశంలో ఎన్జీ కళాశాల పూర్వ విద్యార్థి ఎంజీయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొ. కె.నరేందర్రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్ ఎంవీ గోనారెడ్డి, మాజీ ఐఎఎస్ చోల్లేటి ప్రభాకర్, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.