మిర్యాలగూడ, డిసెంబర్ 8 : విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయని ఎంఈఓ బాలాజీనాయక్ అన్నారు. పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలోగల లిటిల్ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు శుక్రవారం నిర్వహించిన లెడ్ కాన్ఫరెన్స్ వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక అంశాలపై ఆసక్తి కలిగించి వారిని ఆ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లాకార్యదర్శి గాదె రవీందర్, పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజన్, వైస్ప్రిన్సిపాల్ జిన్సీ జయరాజన్, ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్ అమరేందర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.