నీలగిరి, నవంబర్ 29 : నల్లగొండ పట్టణాన్ని కనివినీ ఎరుగతి రీతిలోఅభివృద్ధ్ది పనులు చేపడుతున్నట్లు నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ శివారులోని ఎన్హెచ్ 65 రహదారిపై ఇప్పటికే పానగల్ బైపాస్ వద్ద బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
అదే తరహాలో మర్రిగూడ బైపాస్ వద్ద కూడా రూ.48 కోట ్లతో ఫ్లై ఓవర్ పనులను మరో వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు వివరించారు. అలాగే పట్టణంలోని అంతర్గత రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వాటికి అవసరమైన సుమారు రూ.100 కోట్లు రెండు దఫాలుగా విడుదల చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పాతబస్తీలోని పూల్ నుంచి జీఎల్ గార్డెన్ వరకు 80 ఫీట్ల రోడ్డును కూడా ఆధునీకరించనున్నట్లు తెలిపారు.
సీనియర్ కౌన్సిల్ సభ్యుడు కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ 3వ వార్డు పరిధిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. 48వ వార్డు కౌన్సిలర్ యామ కవితారాణీదయాకర్ మాట్లాడుతూ వచ్చే నెలలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమ వుతున్న నేపథ్యంలో రామాలయం వద్ద పారిశుద్ధ కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. పలువురు కౌన్సిలర్లు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకురావడంతో పరిష్కరిస్తామని హామీఇచ్చారు.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, ఫ్లోర్ లీడర్లు అభిమన్యు శ్రీనివాస్, బుర్రి శ్రీనివాస్రెడ్డి, బండారు ప్రసాద్, కౌన్సిలర్లు పిల్లి రామరాజు, ఎడ్ల శ్రీనివాస్, బోయినపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, సమీ, బొజ్జ మల్లికానాగరాజు, ఉట్కూరి వెంకట్రెడ్డి, జమాల్ఖాద్రి, ఖయ్యుంబేగ్, గున్రెడ్డి రాధికాయుగేంధర్రెడ్డి, కంచర్ల తేజశ్రీరంజిత్, అదనపు కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఏసీపీ నాగిరెడ్డి పాల్గొన్నారు.