కట్టంగూర్, ఆగస్టు 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 18న నిర్వహించే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా కట్టంగూర్ మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మల్లేశ్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.
తన నియమకానికి సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పాన్నం ప్రభాకర్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, గౌడ్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు, మాజి మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే బూదిడ భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.