కోదాడ, సెప్టెంబర్ 01 : బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నుండి ఆరు రోజులపాటు జరగనున్న ధర్నాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. హామీ ఇచ్చిన విధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న ధర్నాలకు పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ నాయకులు చీమ నరేష్, ఉపేంద్ర గౌడ్, కరీముల్లా బాబా, బత్తుల ఉపేందర్, తాజుద్దీన్, శ్రీకాంత్, శ్రీను, చింతల లింగయ్య, నాగరాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు.