‘ఉద్యమ సమయంలో తుంగతుర్తి గుండా నేను ఏ ఊరికి పోయినా ఏ చెరువులో కూడా చారెడు నీరు కనపడేది
కాదు. ఇయ్యాల నేను హెలికాప్టర్లో వస్తా ఉంటే మంత్రి జగదీశ్ర్రెడ్డి గారు.. నా పకనే కూసొని ఒక్కో ఊరి పేరు, చెరువు పేర్లు చెప్తూ వచ్చారు. ఏ చెరువు చూసినా ఒక వాన పడితే మత్తటి దూకేంత బ్రహ్మాండంగా ఉన్నాయి. గతానికి ఇప్పటికి తుంగతుర్తిని చూస్తుంటే ఒక తుర్తి కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని గోదావరి జలాలు పట్టుపట్టి తెచ్చుకోగలిగినం కాబట్టి ఇక్కడ 1.30లక్షల ఎకరాల వరకు నీళ్లొస్తున్నయ్. తుంగతుర్తి జనాల ముఖాలు తెల్లబడ్డాయ్. గతంలో ఉన్న బాధ, దుఃఖం ఇప్పుడు కనపడ్త లేదు. దీనంతటికీ మీ పట్టుదల కలిగిన ఎమ్మెల్యే గాదరి కిశోర్దే’నని తుంగతుర్తి సమర శంఖారావం సభలో బీఆర్ఎస్
అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు.
‘ఉద్యమ సమయంలో తుంగతుర్తి గుండా నేను ఏ ఊరికి పోయినా ఏ చెరువులో కూడా చారేడు నీరు కనపడేది కాదు. ఇయ్యాల నేను హెలికాప్టర్లో వస్తా ఉంటే మంత్రి జగదీశ్రెడ్డి.. నా పకనే కూసోని ఇది ఈ ఊరు చెర్వు… అది ఆ వూరి చెర్వు అంటూ చెప్తుంటే… ఏ చెరువు చూసినా ఒక వాన పడితే మత్తడి దూకేంత బ్రహ్మాండంగా ఉంది. గతానికి ఇప్పటికి తుంగతుర్తిని చూస్తుంటే ఒక తుర్తి కలుగుతుంది.’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.
‘ఈ పరిస్థితి అంతటికీ కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని గోదావరి జలాలు పట్టుపట్టి తెచ్చుకోగలిగినం కాబట్టి బ్రహ్మాండంగా ఇక్కడ 1.30లక్షల ఎకరాల వరకు నీళ్లోస్తున్నయ్. అందుకే తుంగతుర్తి జనాల ముఖాలు తెల్లబడ్డాయ్. గతంలో ఉన్న భాద, దుఃఖం ఇప్పుడు కనపడ్త లేదు’ అని అన్నారు. దీనంతటికీ కారణం మీ పట్టుదల కలిగిన ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్నే అని కేసీఆర్ అభినందించారు. కరువు బారినపడి వలసల పోయే తుంగతుర్తిని బ్రహ్మండంగా అభివృద్ధి చేస్తున్నాడని, కిక్కిరిసిపోయేలా ఈ సభకు వచ్చిన జనాలే కిశోర్ పనితనానికి నిదర్శనమన్నారు.
కిశోర్ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే తుంగతుర్తి నియోజకవర్గానికి మొత్తం దళితబంధు ఇస్తానని కేసీఆర్ ప్రకటించడంతో సభా ప్రాంగణం హర్షద్వానాలతో దద్దరిల్లింది. ఆదివారం తిరుమలగిరిలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అధ్యక్షతన జరిగిన తుంగతుర్తి సమర శంఖారావం బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సీఎం కేసీఆర్కు నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు బ్రహ్మారథం పట్టారు. తిరుమలగిరి పట్టణం గులాబీవనాన్ని తలపించింది.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్29(నమస్తే తెలంగాణ) : తుంగుతర్తి నియోజకవర్గ సమర శంఖారావ సభ ఆదివారం తిరుమలగిరిలో భారీ జన సందోహంతో సాగింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధిని ప్రశంసిస్తూ మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడంతో ప్రజలు ఈలలు, కేకలతో సభ ప్రాంగణం మార్మోగింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. ‘ఉద్యమంలో పలు సందర్భాల్లో నేను తుంగతుర్తి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు గోదావరి జలాలు రావాలంటే ఆనాటి కమ్యూనిస్టు యోధుడు బీయన్.రెడ్డి గారికి ఓటేయాలని గోడల మీద నినాదాలు కనబడేవి.. ఈ ప్రాంతం పోరాటాల గడ్డ.. ఎన్ని పోరాటాలు చేసినా.. కొట్లాడినా… ఏ ప్రభుత్వం కూడా కనికరించలేదు.. తుం గతుర్తి నియోజకవర్గం కరువుకు గురైంది.
ప్రజలు వలసలు పోయారు’ అని గుర్తు చేసుకున్నారు. ‘కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తెచ్చుకున్నం. 1.30లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నయ్. ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నయ్’ అని చెప్పారు. ‘గతంలో ఇకడ ఎక్కడా చూసినా స్థూపాలు కనపడేవి… కమ్యూనిస్టు, కాంగ్రెస్ పంచాయితీల వల్ల హత్యలు, కేసులు, గొడవలతో వల్లకాడుగా ఉండేది. అటువంటి తుంగతుర్తి ఈ రోజు బ్రహ్మాండంగా అద్భుతమైన పద్దతిలో తయారవుతుంది’ అని కేసీఆర్ వివరించారు.
‘తుంగతుర్తి ఇంతటి అద్భుతాలను సాధించిందంటే.. ఇది సామాన్యమైన ఎమ్మెల్యే చేస్తే అయ్యేది కాదు. చాలా పట్టుదల ఉన్న ఎమ్మెల్యే కిశోర్తోనే సాధ్యమైంది. మొదటి నుంచి ఉద్యమంలో నాతో పాటు ఉన్నడు. పోలీసుల దెబ్బలు తిన్నోడు. జైలుకు కూడా పోయినోడు కాబట్టే… పట్టుబట్టి తన తంగతుర్తిని అభివృద్ధి చేసుకోవాలని ఇవన్నీ తెచ్చాడు’ అంటూ సీఎం కేసీఆర్ చెప్పారు.
నీళ్లతో పాటు కరెంటు కష్టాలు పోగొట్టేందుకు ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోకుండా… రెండు 220కేవీ సబ్స్టేషన్లతో పాటు 15 సబ్ స్టేషన్లను తీసుకువచ్చాడన్నారు. దంతాలు ఊడిపోయేలా ఉండే దంతాలపల్లి రోడ్డును మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్ పట్టుపట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారని వివరించారు. నియోజకవర్గంలోని అనేక తండాలను గ్రామ పంచాయతీలు చేశామని, మిగతా చోట్ల పోడు పట్టాలు కూడా ఇచ్చామని చెప్పారు. తుంగతుర్తిలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ రక్తం పారిస్తే..
తిరుమలగిరి, అక్టోబర్ 29 : రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ పాలనలో తుంగతుర్తి నియోజకవర్గం కక్ష్యలు, కన్నీళ్లతో రగిలిపోయేదని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ఆదివారం తిరుమలగిరిలో నిర్వహించిన తుంగతుర్తి సమర శంఖారావ సభలో ఆయన మాట్లడారు. 2014, 2018లో ఉద్యమ రథసారధి, సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చి ఈ ప్రాంతానికి పంపితే తుంగతుర్తి ప్రజలు ఆశీర్వదించి గెలిపించారన్నారు.
2014కు ముందు కాంగ్రెస్ హయాంలో తుంగతుర్తి గడ్డపై కక్ష్యలు, కొట్లాటలతో రక్తం పారేదని, రాష్ట్రం ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి సాగు నీరు పారించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో లక్ష యాబై వేల ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందుతున్నాయంటే అపర భగీరథుడు సీఎం కేసీఆర్ కృషి వల్లే అని తెలిపారు. ముప్పై, నలబై సంవత్సరాల నుంచి నిండని చెరువులు నేడు ఎండకాలంలోనైనా, చలికాలంలోనైనా మత్తడి దుంకుతున్నాయని, అది సీఎం కేసీఆర్ ఘనతేనని చెప్పుకొచ్చారు.