తన తండ్రి జ్ఞాపకార్థం వీధి బాలల సంక్షేమ ఆశ్రమానికి పౌర సరఫరా శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ దుస్తులు, ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదృశ్చికంగా ఫాదర్స్ డే నాడే తన తండ్రిని తలచుకునే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.
చేతనైనంత వరకు ఇతరులకు సాయం చేయమని తన తండ్రి చనిపోయే ముందు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆ మాటలనే వేదవాక్కుగా భావించి నాన్న పేరిట పేద విద్యార్థులకు సాధ్యమైనంత మేర సాయం చేస్తున్నానని తెలిపారు. యువత పొగాకు, ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారని.. అందుకే వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పితృసేవను దైవ సేవగా భావించాలని మాచన సూచనగా కోరారు.