యాదాద్రి, జూలై 13 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవాన్ని అర్చకులు బుధవారం ఘనంగా జరిపించారు. స్వామివారి నిత్యపూజలు వేకువజామున 3.30గంటలకు మొదలయ్యాయి. స్వయంభువులకు ఆరాధనలు జరిపి పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు చేశారు. లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
స్వయంభూ ఆలయ ఉత్తర దిశ లోపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి నిత్య తిరుల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపించారు. సాయంత్రం వేళ స్వామివారికి తిరువారాధన, అలంకార జోడు సేవలు, దర్బార్ సేవ నిర్వహించారు. సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి సహస్రనామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేశారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయరీతిలో నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిపించారు. సత్యనారాయణ స్వామి వత్ర పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు రూ.7,15,662 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న వైజాగ్ ఎమ్మెల్యే
యాదాద్రీశుడిని వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్రావు, సినీ నిర్మాత అశోక్కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయాధికారులు స్వామివారి ప్రసాదం అందించారు. అదేవిధంగా దివంగత సినిమా హీరో శ్రీహరి సతీమణి శాంతి స్వామిని దర్శించుకున్నారు.