– కోదాడ సామిల్ టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమల్లు నరసింహ చారి
కోదాడ, జూలై 18 : ఐకమత్యతతో సంఘాన్ని బలోపేతం చేసుకుందామని కోదాడ సామిల్ టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమల్లు నరసింహ చారి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. యజమానుల హక్కుల రక్షణకు, వ్యాపారాల్లో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సామిల్ పరిశ్రమ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కొల్లూరి వేణుగోపాల్, కోశాధికారి గొల్లపల్లి బాలకృష్ణ, రాష్ట్ర నాయకులు గొల్లపల్లి అనిల్, భరత్ పటేల్, పమ్మి ఉపేంద్ర చారి, పమ్మి నాగ బ్రహ్మచారి, కొత్త శంకర్, రంజిత్ నాయక్, ఇటికల శివబ్రహ్మచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.